సాక్షి, చెన్నై: బ్లడ్ కేన్సర్తో బాధపడుతున్న చెన్నైకి చెందిన యువ ఇంజనీర్ ప్రీతి (26)ని ఆదుకునేందుకు పలువురు తమిళులు ముందుకొచ్చారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ప్రీతి 25 రోజుల కిందట హఠాత్తుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో వైద్యులు పరీక్షించి ఆమెకు బ్లడ్ కేన్సర్ ఉందని నిర్ధారించారు. చికిత్సకు రూ.45 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు.
దీంతో ప్రీతి స్నేహితులు ఫేస్ బుక్ ద్వారా తమ సన్నిహితులు, మిత్రుల ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. మూడు రోజుల్లోనే సుమారు రూ.42 లక్షలు సమకూరాయి.