నయీం కీలక అనుచరుడి అరెస్ట్

31 Aug, 2016 16:32 IST|Sakshi
నయీం కీలక అనుచరుడి అరెస్ట్
హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీం కేసులో మరో కీలక అనుచరుడు బుధవారం లొంగిపోయాడు. రంగారెడ్డి జిల్లా కోర్టులో లొంగిపోయిన వ్యక్తిని శ్రీహరిగా గుర్తించారు. సొహ్రాబుద్దీన్ గుజరాత్ ఎన్కౌంటర్ కేసులో ఆయన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నాడు. 
 
నయీం ఎన్కౌంటర్ అనంతరం శ్రీహరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. నాటకీయ పరిణామాల మధ్య బుధవారం కోర్టులో లొంగిపోవడంతో... ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నయీం కేసులో ఇప్పటికే సుమారు 50 మంది నయీం అనుచరులను సిట్ బృందం అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. మరికొందరి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. తాజాగా శ్రీహరి లొంగుబాటుతో మరిన్ని కేసులు కొలిక్కి వచ్చే అవకాశముంది. 
>
మరిన్ని వార్తలు