ప్రకాశం బ్యారేజి గేట్లు ఎత్తివేత

1 Oct, 2016 13:00 IST|Sakshi
అమరావతి: ఎగువ నుంచి వస్తున్నవరదతో ప్రకాశం బ్యారేజి వద్ద నీటి మట్టం పెరిగింది. దీంతో అధికారులు బ్యారేజి 20 గేట్లను ఎత్తి 14, 340 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. ప్రస్తుతం బ్యారేజి వద్ద నీటి మట్టం 11.8 అడుగులు. కాగా, కాలువలకు 10, 097 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
 
మరిన్ని వార్తలు