-

'బాబు దాష్టికానికి దేవుడి మొట్టికాయలు తప్పదు'

18 Aug, 2016 13:28 IST|Sakshi
'బాబు దాష్టికానికి దేవుడి మొట్టికాయలు తప్పదు'

విజయవాడ: ఆరు దశాబ్దాల చరిత్ర ఉన్న మహాత్ముడి విగ్రహాన్ని పగులగొట్టి బుడమేరు కాల్వలో పడేయటం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దాష్టికానికి నిదర్శనం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బాబు పాలనలో గాంధీజీ, వైఎస్ఆర్ విగ్రహాలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురువారం కృష్ణపుష్కరాల్లో భాగంగా పున్నమి ఘాట్ లో స్నానమాచరించిన ఆయన అనంతరం ఇబ్రహీం పట్నం వెళ్లారు. అక్కడ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు దుర్మార్గాలకు ఆ దేవుడే మొట్టికాయలు వేయాలని అన్నారు. చంద్రబాబు ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతుందని, ఆయనకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


మరిన్ని వార్తలు