సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఢిల్లీలో ఘనంగా జరుపుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ సభ్యుడు చందా లింగయ్య దొర ఆధ్వర్యంలో శని వారం ఉదయం ఏపీభవన్ ఆవరణలో కేక్ కట్చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. వేడుకల్లో పలువురు వైఎస్ జగన్ అభిమానులు పాల్గొన్నారు. జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి..అంటూ నినాదాలు చేశారు. జననేత జగన్ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని చందా లింగయ్యదొర ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ మన్యసీమ నాయకుడు జంగు, వరంగల్ జిల్లాకి చెందిన మంకిడి నర్సమ్మతోపాటు పలువురు జగన్ అభిమానులు పాల్గొన్నారు.