ఘనంగా ఆలయ కుంభాభిషేకం

27 Aug, 2013 03:52 IST|Sakshi
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్: చెన్నై షావుకార్ పేట తిరువల్లి వీధిలో వెలిసిన శ్రీ కర్పగ వినాయక ఆలయానికి సోమవారం ఉదయం అష్టబంధన మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 23వ తేదీ నుంచి సోమవారం వరకు ఆలయంలో ప్రత్యేక పూజలతోపాటు హోమం చేశారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో 5 వేల మందికి అన్నదానం చేశారు. 
 
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు ఎన్ బాలగంగ, హార్బర్ నియెజకవర్గం ఎమ్మెల్యే కరుపయ్యా, చెన్నై మండల జాయింట్ కమిషనర్ ఎన్ తిరుమల్, మండల కమిటీ సభ్యులు ఆర్ ప్రతాప్‌కుమార్, అరుతవేల్, ఆవిన్ ఆర్ ఉభయదారులు పి.ముత్తుకృష్ణన్, ఆలయ ట్రస్టు వంశీయులు గుణశేఖరన్, తిరుత్తణి ఆలయం తక్కర్ జయశంకర్, ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి సంపత్, ఆ ప్రాంతం కౌన్సిలర్ ఆర్ ప్రతాప్‌కుమార్ పాల్గొన్నారు. ఆలయ కుంభాభిషేకం కార్యక్రమాలు నిర్వాహకులు కేఆర్ పద్మనాభన్, శ్రీమతి శివగామి అమ్మాల్ నేతృత్వంలో జరిగాయి.
 
మరిన్ని వార్తలు