గుప్తనిధుల ముఠా సభ్యులు అరెస్ట్

16 Oct, 2016 09:20 IST|Sakshi

భూపాలపల్లి: గుప్త నిధుల ముఠా సభ్యుల గుట్టును కొయ్యూరు పోలీసులు ఆదివారం రట్టు చేశారు. ముఠాకు చెందిన 9 మంది సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆచార్య జయశంకర్ జిల్లాలోని మల్హార్ మండలం పెద్దతూండ్ల అటవీప్రాంతంలో భారీగా తవ్వకాలు జరిపినట్లు వారు పోలీసుల విచారణ తెలిపారు.

మరిన్ని వార్తలు