ఇల్లెందు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సుమారు గంటపాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అకాల వర్షంతో జన జీవనం స్తంభించింది. ప్రస్తుతం చిన్నపాటి చినుకులు కురుస్తున్నాయి.