పార్వతీపురంలో భారీ వర్షం

12 Sep, 2016 10:20 IST|Sakshi
పార్వతీపురం : విజయనగరం జిల్లా పార్వతీపురంలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరహాల గడ్డ సమీపంలోని రాజీవ్ గృహకల్పలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పట్టణంలోని సెంటర్ సమీపంలో భారీ వర్షానికి ఓ ఇంటి ప్రహరి గోడ కూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని వార్తలు