బాక్సైట్ తవ్వకాలపై హైకోర్టులో పిటిషన్

8 Nov, 2016 15:11 IST|Sakshi
బాక్సైట్ తవ్వకాలపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్‌: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల లీజు విషయంలో గిరిజనులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారించిన హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. గిరిజనుల హక్కులను ఏవిధంగా పరిరక్షిస్తున్నారని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. అక్కడ ఏం జరుగుతుందో తెలపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేసును రెండు వారాల పాటు వాయిదా వేసింది.
 
 
>
మరిన్ని వార్తలు