చింతపల్లిలో ల్యాండ్‌మైన్‌ పేలుడు: హోంగార్డు మృతి

5 May, 2017 13:00 IST|Sakshi
విశాఖపట్నం: విశాఖ జిల్లాలోని చింతపల్లి మండలంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. స్థానిక మేడివాడ పంచాయతీ పరిధిలో రామన్నపాలెం వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ సంఘటనలో ఒక హోంగార్డు మృతి చెందాడు. పోలీసు వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వార్తలు