‘అనంత’ ఘటనపై హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం

18 Nov, 2016 16:22 IST|Sakshi

హైదరాబాద్: అనంతపురంలోని ఓ బ్యాంక్ వద్ద పోలీసుల ఓవరాక్షన్‌పై మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్‌సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తిపై పోలీసుల దాష్టీకాన్ని హెచ్‌​ఆర్‌సీ సుమోటో కేసుగా స్వీకరించింది. దాడికి పాల్పడిన పోలీసులను గుర్తించి తమకు వివరాలు అందజేయాలని కోరింది. ఈ ఘటనపై ఈనెల 24వ తేదీలోగా సమగ్ర నివేదిక అందజేయాలని ఏపీ డీజీపీ, అనంతపురం ఎస్పీలను ఆదేశించింది.

మరిన్ని వార్తలు