విజయవాడ : విజయవాడ నగరంలో ప్రైవేట్ ట్రాన్సుపోర్టు కార్యాలయంలో భారీ చోరీ జరిగింది. కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలోని పాడి వీధిలో ఉన్న బాంబే-ఆంధ్ర ట్రాన్సుపోర్టు కంపెనీ కార్యాలయం తలుపులు పగులగొట్టి క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.10 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. కొత్తపేట పోలీసులు, క్లూస్ టీం సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.