ఎస్సార్బీసీ ప్రధాన కాల్వకు గండి

27 Aug, 2016 10:52 IST|Sakshi
పొలాల్లోకి వెళ్తున్న నీరు
 అవుకు: అవుకు రిజర్వాయర్‌కు నీటిని చేర్చుతున్న ఎస్సార్బీసీ ప్రధాన కాలువ (11 వబ్లాక్‌)కు శుక్రవారం రాత్రి గండిపడింది. రిజర్వాయర్‌కు ఈ నెల 16న శ్రీశేలం నుంచి 3,600 క్యుసెక్కుల ప్రకారం నీటిని విడుదల చేస్తున్నారు. అయితే నీటి విడుదలకు ముందు కాల్వను పరిశీలించి పటిష్టం చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతో కాల్వకు గండి పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇదేచోట గండి పడిందని, తర్వాత గండి పడే అవకాశం ఉందని సంబంధిత అధికారులకు తెలియజేసినా నిర్లక్ష్యం వహించారని చెబుతున్నారు. కనీసం నెలకోసారైనా అధికారులు కాల్వ వెంట పర్యటించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
మరిన్ని వార్తలు