భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా

20 Dec, 2017 08:18 IST|Sakshi

కోలారు: కట్నం తేలేని పక్షంలో తాను మరో యువతిని వివాహం చేసుకుంటానని హెచ్చరించడంతో ఓ  ఇల్లాలు తన భర్త ఇంటి ఎదుటే ఆందోళనకు దిగింది. ఈఘటన మంగళవారం శ్రీనివాసపురం తాలూకా శెట్టిహళ్లిలో చోటు చేసుకుంది. వివరాలు.... శెట్టిహళ్లికి చెందిన మంజునాథ్, అదే ప్రాంతానికి చెందిన వేదకు సంవత్సరం క్రితం వివాహం జరిగింది. అయితే కట్నం తేవాలంటూ పెళ్లయిన మూడు నెలలకే మంజునాథ్‌ తన భార్యను పుట్టినింటికి పంపించి వేశాడు.  విడాకులు ఇచ్చి తాను మరో వివాహం చేసుకుంటానని హెచ్చరికలు జారీ చేశాడు.  న్యాయం కోసం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో వేద మంగళవారం తన భర్త ఇంటిముందు బైఠాయించింది. తనకు భర్త కావాలని, ఈమేరకు న్యాయం చేయాలని వేడుకుంది. వేదకు గ్రామంలోని రైతు సంఘం, దళిత సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. పంచాయితీ చేసి న్యాయం చేస్తామని గ్రామపెద్దలు చెప్పడంతో ఆమె తాత్కాలికంగా ధర్నాను విరమించింది. 

మరిన్ని వార్తలు