పప్పుగుత్తితో భర్తను చంపిన భార్య

26 Aug, 2016 16:27 IST|Sakshi
జగద్గిరిగుట్ట : నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని జగద్గిరినగర్‌లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబకలహాల నేపథ్యంలో భర్త సంజీవ్‌ను భార్య యాదమ్మ పప్పుగుత్తితో తలపై కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాదమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వార్తలు