ప్రేమించి పెళ్లి చేసుకొని..

28 Sep, 2016 10:59 IST|Sakshi

 ప్రేమించి పెళ్లి చేసుకొని కడదాక తోడుంటానని మాటిచ్చిన భర్త, భార్యపై అనుమానంతో.. అతి కిరాతకంగా అంతమొందించాడు. ఈ సంఘటన విజయనగరం పట్టణంలో మంగళ వారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన గీత(32)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త గత కొంతకాలంగా ఆమెను వివాహేతర సంబంధం పేరిట హింసిస్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న గీత తలపై ఇనుప రాడ్డుతో కొట్టి దారుణంగా హతమార్చాడు. అనంతరం టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.

 

మరిన్ని వార్తలు