సమగ్ర దర్యాప్తునకు ఆదేశించండి

17 Feb, 2014 02:09 IST|Sakshi

= సీఎంకు రామదాసు లేఖ
సాక్షి, బెంగళూరు : ‘తన వ్యక్తిగత జీవితంతో పాటు ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టయిన  రాజకీయతకే మచ్చ తెచ్చేలా ప్రేమకుమారి అనే మహిళ నాపై ఆరోపణలు చేశారు. ఈ విషయంపై నిజానిజాలు బయటికి రావాలంటే సమగ్ర దర్యాప్తునకు ఆదేశించండి.’ అంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మాజీ మంత్రి ఎస్‌ఎ రామదాసు లేఖ రాసారు.

ఈ నెల 14న ఆయన రాసిన లేఖ మీడియాకు ఆదివారం అందింది. ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం... రాజకీయ కుట్రతోనే తన ప్రత్యర్థులు ఇందులో ఇరికించారని, ఆ మహిళతోపాటు కొంతమంది బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని వాపోయారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపి నేరానికి పాల్పడిన వారికి శిక్షపడేలా చేయాలని లేఖలో సిద్ధరామయ్యను ఆయన కోరారు.
 

మరిన్ని వార్తలు