పార్టీని నాశనం చేయడం అసాధ్యం

12 Nov, 2014 03:15 IST|Sakshi
పార్టీని నాశనం చేయడం అసాధ్యం

డీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ

సాక్షి,బెంగళూరు :  తన ఊపిరి ఉన్నతం వరకూ జేడీఎస్ పార్టీని నాశయం చేయడానికి సాధ్యం కాదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ పేర్కొన్నారు. బెంగళూరులోని జేడీఎస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నయని కొందరూ పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా పార్టీని నాశనం చేయడానికి సాధ్యం కాదన్నారు.  

రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల్లోకి వెళ్లేవారిని అడ్డుకోబోమన్నారు. అయితే వారు అనవసరంగా జేడీఎస్ పట్ల, అందులోని నాయకుల పై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. నైస్ ప్రాజెక్టు అక్రమాల్లో ఇంధన శాఖ మంత్రి డీకే శివకుమార్‌కూ భాగముందని దేవెగౌడ ఆరోపించారు. ఈ విషయాలన్నీ తెలిసినా సీఎం సిద్ధరామయ్య మిన్నకుండటం పలు అనుమానాలకు తావిస్తోందని దేవెగౌడ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు