త‍్వరలో నెఫ్రాలజిస్టుల నియామకం: కామినేని

15 Apr, 2017 13:08 IST|Sakshi
శ్రీకాకుళం: త్వరలో నెఫ్రాలజిస్టులను నియమిస్తామని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. శనివారం జిల్లాలోని శ్రీకాకుళం జిల్లా పలాసలో డయాలసిస్‌ సెంటర్‌ను మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్దానం ప్రాంతంలో మూడు డయాలసిస్‌ సెంటర్లు ప్రారంభించామన్నారు. మరో 15 రోజుల్లో కిడ్నీ బాధిత ప్రాంతాల్లో వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
మరిన్ని వార్తలు