న్యూఢిల్లీ :
డ్రగ్స్ మాఫియాపై సీబీఐ విచారణ జరిపించాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, నేషనల్ యాంటీ డ్రగ్ వారియర్ చైర్మన్ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర హోంశాఖ కార్యాలయం, లోక్సభ స్పీకర్, ప్రతిపక్ష సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, డీఎంకే ఎంపీ కనిమొళి తదితరులకు డ్రగ్స్ వలన జరుగుతున్న నష్టలను వివరిస్తూ వినతి పత్రాన్ని అందజేశారు.