బ్రిడ్జిని ఢీ కొన్న లారీ...నిలిచిన ట్రాఫిక్

1 Oct, 2016 10:22 IST|Sakshi
బ్రిడ్జిని ఢీ కొన్న లారీ...నిలిచిన ట్రాఫిక్
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో ఓ లారీకి తృటిలో పెనుప్రమాదం తప్పింది. మద్నూర్ మండలం పెద్దఎక్లారం జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున అతివేగంగా వస్తున్న లారీ బ్రిడ్జిని ఢీ కొట్టింది. 
 
ఈ ప్రమాదంలో లారీ వంతెనపై వేలాడుతూ నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో దాదాపు 10కి.మీ.మేర ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సాయంతో లారీని తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
మరిన్ని వార్తలు