చెన్నై: ప్రేమించుకున్నారు.. పెద్దలు అంగీకరించలేదు.. దీంతో మనస్థాపం చెందిన ప్రియురాలు విషం తాగి ఆత్మహత్య చేసుకోగా..ప్రియుడు రైలు కింద పడి బలవన్మరణం పొందాడు. ఈ హృదయ విచారక ఘటన తమిళనాడు కడలూరు సమీపంలోని కొండూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుణ(26) అలియాస్ ధర్మన్ రైల్వే పోలీసుగా పనిచేస్తున్నాడు.
గుణ అదే గ్రామానికి చెందిన కయల్ విళి(23)లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు అమ్మాయి తల్లితండ్రులు ఒప్పుకోలేదు. దీంతో విరక్తి చెందిన కయల్ విళి గురువారం మధ్యాహ్నం విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలి మృతిని తట్టుకోలేని ధర్మన్ అదే రోజు చోళన్ ఎక్స్ ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి ఆత్మహత్యతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.