ఈడీ నోటీసులే కారణమా?

26 Jan, 2017 14:50 IST|Sakshi
ఈడీ నోటీసులే కారణమా?
హైదరాబాద్‌: ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని మొదట వ్యతిరేకించిన సీఎం కేసీఆర్, ఆ తర్వాత సమర్ధించడానికి ఈడీ నోటీసులే కారణమని మాజీ ఎంపీ మధుయాష్కి ఆరోపించారు. దొంగ కంపెనీలతో కేసీఆర్ కుటుంబ సభ్యులు మనీ ల్యాండరింగ్ కు పాల్పడుతున్నారని ఈడీ నోటీసులు ఇచ్చింది వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ని ఎంపీ కవిత కమీషన్ల కోసం గాయత్రీ షుగర్స్ కి కట్టబెట్టారన్నారు. 
>
మరిన్ని వార్తలు