మహిళపై వేడినూనె చల్లిన వ్యక్తి అరెస్ట్‌

1 Oct, 2016 09:37 IST|Sakshi

హోసూరు: కబాబ్‌ దుకాణంలో యజమానిపై కాగుతున్న నూనె చల్లిన వ్యక్తిని మహారాజగడ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. క్రిష్ణగిరి జిల్లా ఊత్తంగేరి సమీపంలోని మగనూర్‌పట్టికి చెందిన పర్విన్‌(32) చికెన్‌కబాబ్‌ దుకాణం నిర్వహిస్తుంది. గురువారం రాత్రి ఆ దుకాణానికి  వచ్చిన అబ్దుల్‌కుద్దూస్‌ (31) వచ్చి కబాబ్‌ తిని వెళ్తుండగా దుకాణ యాజమాని పార్విన్‌ డబ్బులు అడగడంతో వారిమధ్య వాగ్వాదం జరిగింది.  

ఈ గొడవలో అబ్దుల్‌ కుద్దూస్‌ కాగుతున్న నూనె మహిళపై చల్లాడు. తీవ్రంగా గాయపడిన పర్విన్‌ను స్థానికులు చికిత్స కోసం ఊత్తంగేరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై మహారాజగడ పోలీసులు కేసు నమోదు చేసుకొని, అబ్దుల్‌కు కుద్దూస్‌ను అరెస్టు చేశారు.

>
మరిన్ని వార్తలు