ములుగు జిల్లా కోసం వ్యక్తి ఆత్మహత్యాయత్నం

7 Oct, 2016 16:34 IST|Sakshi
ములుగు: ములుగును జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్ రోజు రోజుకు ఎక్కువవుతోంది. అఖిల పక్షాల ఆధ్వర్యంలో గతరెండు రోజులుగా ములుగులో రాస్తారోకోలు, నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లా సాధన సమితి అధ్యక్షుడు మంజల బిక్షపతి వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. ఇది గుర్తించిన పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 
మరిన్ని వార్తలు