తంజావూరులో మరియమ్మ విగ్రహం చోరీ

27 Jan, 2017 11:57 IST|Sakshi
తంజావూరు: పురాతన ఆలయంలోని మరియమ్మ అమ్మవారి కాంస్య విగ్రహం చోరీకి గురైంది. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. ఆలయ తలుపులు పగలగొట్టి గుర్తుతెలియని దుండగులు సుమారు 20 కిలోల బరువైన అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం పూజలు నిర్వహించడానికి గుడికి వెళ్లిన స్థానికులు చోరీ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. వందల ఏళ్లనాటి మరియమ్మ అమ్మవారి విగ్రహం ఖరీదు లక్షల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు.
మరిన్ని వార్తలు