మాస్టర్ ఆదిత్య రికార్డు

25 Apr, 2014 23:23 IST|Sakshi
మాస్టర్ ఆదిత్య రికార్డు

ముంబై: రియాన్ ఇంటర్నేషనల్ స్కూలులో పదో తరగతి చదువుతున్న మాస్టర్ ఆదిత్య భరద్వాజ్ ఈతలో రికార్డు సృష్టించాడు. కాసా దీవి నుంచి ఎలిఫెంటాకు నాలుగు గంటల పది నిమిషాల్లో చేరుకున్నాడు. ఈ రెండింటి మధ్యదూరం 19 కిలోమీటర్లు. ప్రముఖ ఈతగాళ్లు సంకేత్ సావంత్, సంతోష్ కుమార్‌ల మార్గదర్శనంలో ఇందుకోసం ప్రతిరోజూ ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడుగంటల పాటు సాధన చేశాడు. ఈ సందర్భంగా ఆదిత్య మీడియాతో మాట్లాడుతూ కాసా ద్వీపం నుంచి బయల్దేరిన  తర్వాత తొలి రెండు గంటలపాటు అనేక అవరోధాలను ఎదుర్కొన్నానన్నాడు. ఇందుకోసం మరింత శ్రమిం చాల్సి వచ్చిందన్నాడు. ఈ ఏడాది చివరిలో జరగనున్న అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలనేది తన ఆకాంక్ష అని చెప్పాడు. 

మరిన్ని వార్తలు