’ఆయుష్ వైద్యం మరింత బలోపేతం’

25 Oct, 2016 15:51 IST|Sakshi
’ఆయుష్ వైద్యం మరింత బలోపేతం’
సిద్ధిపేట: ఆయుష్ వైద్య విభాగాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు అందుబాటులో ఉండేలా తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంటోందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ధన్వంతరి జయంతి-జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సిద్ధిపేట జిల్లా కేంద్రమైన టీఎన్జీవోస్ భవనంలో ఉచిత ఆయుర్వేద శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా అల్లోపతి వైద్యానికి దీటుగా ఆయుష్ వైద్యాన్ని తీర్చిదిద్దేలా చర్యలు చేపడుతున్నదని చెప్పారు. వైద్య రంగంలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొనారు.
 
మరిన్ని వార్తలు