మినీ లారీలు ఢీ : ఇద్దరు మృతి

1 Sep, 2016 09:11 IST|Sakshi
విజయవాడ: కృష్ణాజిల్లాలో ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందగా... మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద గురువారం ఉదయం చోటుచేసుకుంది.
 
హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న మినీ లారీని ఎదురుగా వస్తున్న మరో మినీ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వార్తలు