రక్షిత వివాహానికి ప్రధానికి ఆహ్వానం

22 Feb, 2020 08:19 IST|Sakshi
నిశ్చితార్థ వేడుకలో (ఫైల్‌ ఫోటో)

వధూవరులకు మోదీ శుభాశీస్సులు

సాక్షి, బళ్లారి: రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి శ్రీరాములు తన కుమార్తె పెళ్లికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు. దీంతో స్వయాన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వధూవరులకు ఆశీస్సులు, అభినందన లేఖను పంపారు. మార్చి 5న బెంగళూరు ప్యాలెస్‌ మైదానంలో శ్రీరాములు కుమార్తె రక్షితకు హైదరాబాద్‌కు చెందిన సంజీవ్‌రెడ్డితో జరగనున్న పెళ్లికి ఆహ్వానించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రధాని లేఖలో కొత్త జీవితంలో అన్ని రకాలుగా మంచి జరగాలని ఆకాంక్షిస్తూ నూతన వధూవరులతో పాటు మంత్రి శ్రీరాములుకు అభినందనలు తెలిపారు.  

వధూవరులకు ప్రధాని ఆశీస్సులు, అభినందన లేఖ

   నిశ్చితార్థ వేడుకకు హాజరైన కర్ణాటక ముఖ్యమంత్రి (ఫైల్‌ ఫోటో)

మరిన్ని వార్తలు