సోషల్ మీడియాలో ఎంఎస్ సుబ్బలక్ష్మి పాటల తొలగింపు

14 Jan, 2016 10:34 IST|Sakshi
సోషల్ మీడియాలో ఎంఎస్ సుబ్బలక్ష్మి పాటల తొలగింపు

చెన్నై: సోషల్‌ మీడియా నుంచి ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్.సుబ్బలక్ష్మి పాటలను తొలగించడంతో కర్ణాటక సంగీత ప్రియులు అసంతృప్తికి గురవుతున్నారు. మార్గశిర మాసం అంటేనే కర్ణాక సంగీత ప్రియులకు అంత్యంత ప్రీతి పాత్రమైనది. ఈ నెలలో పలు కర్ణాటక సంగీతోత్సవాలు నిర్వహిస్తుంటారు.

 

అలాంటి కర్ణాటక సంగీతంలో ఎంఎస్.సుబ్బలక్ష్మి పాటలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఎంఎస్.సుబ్బలక్ష్మి పాటలను సోషల్ మీడియాలో ఆలకించాలని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. యూట్యూబ్ నుంచి సుబ్బలక్ష్మి విష్ణు సహస్రనామం గీతాన్ని తొలగించారు. ఆ గీతాల హక్కులను పొందిన ఆడియో సంస్థ ఆ సహస్రనామ గీతాన్ని తొలగించడం కర్ణాటక సంగీత ప్రియులను నిరాశకు గురిచేసింది.

మరిన్ని వార్తలు