రోడ్లు బాగుచేయకుండా..హెల్మెట్‌ అడుగుతావా?

8 Aug, 2017 17:53 IST|Sakshi
రోడ్లు బాగుచేయకుండా..హెల్మెట్‌ అడుగుతావా?

మైసూరు: హెల్మెట్‌ ఎందుకు పెట్టుకోలేదని పోలీసులు అడిగినందుకు ఆ యువకునికి చిర్రెత్తుకొచ్చింది. అసలు రోడ్డు బాగు చేయకుండా హెల్మెట్‌ పెట్టుకోలేదని ఎందుకు అడుగుతున్నారంటూ ఏఎస్‌ఐపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం మైసూరులో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే నగరంలోని సిద్ధార్థనగర్‌ ట్రాఫిక్‌ ఏఎస్‌ఐ పద్మనాభ అదే ప్రాంతంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మనీశ్‌ అనే యువకుడు హెల్మెట్‌ ధరించకుండా బులెట్‌ వాహనంపై అటుగా వచ్చాడు. దీంతో బైకు నిలపాలని ఏఎస్‌ఐ సూచించగా సదరు వాహనదారుడు తప్పించుకోవడానికి ప్రయత్నించి కిందపడ్డాడు. దీంతో ఆగ్రహం చెందిన మనీశ్‌ రోడ్లను బాగు చేయకుండా హెల్మెట్‌ లేదని బైకులను ఎందుకు ఆపుతున్నారని వాగ్వాదానికి దిగి ఏఎస్‌ఐపై దాడి చేసి పారిపోయాడు. పద్మనాభను ఆస్పత్రికి తరలించిన పోలీసులు, సదరు వాహనదారుడి కోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని వార్తలు