విజయవాడ: జాతీయ భద్రత - సవాళ్లు అంశంపై విజయవాడలో జాతీయ సదస్సు ప్రారంభమైంది. దేశం ఎదుర్కొంటున్న పలు భద్రత సంబంధ సవాళ్లపై ఇందులో నిపుణులు చర్చిస్తారు. ఏపీ డీజీపీ సాంబశివరావుతోపాటు కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, పలువురు సీఐడీ అధికారులు పాల్గొంటున్నారు. స్థానిక ఫార్చ్యూన్ మురళి పార్కు హోటల్లో నేటి నుంచి మూడు రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.