జాతీయస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ప్రారంభం

25 Nov, 2016 10:57 IST|Sakshi
విశాఖపట్నం: విశాఖపట్నంలో జాతీయస్థాయి అంతర్‌జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ పోటీలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శుక్రవారం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 400 జిల్లాలకు చెందిన 3,483 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. షాట్‌పుట్, జావెలిన్, లాంగ్‌జంప్, హైజంప్, డిస్క్‌త్రో, పోల్‌వాల్ట్ తదితర విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. 
 
కాగా మూడు రోజుల పాటు భారీ ఎత్తున ఉక్కు స్టేడియంలో ఈ మీట్ జరగనురంది. జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య సహకారంతో పోటీల నిర్వహణకు రాష్ట్ర  క్రీడాప్రాధికార సంస్థ(శాప్) సిద్ధమైంది. 
 
మరిన్ని వార్తలు