వైఎస్సార్సీపీలో పలు నియామకాలు

11 Nov, 2016 14:35 IST|Sakshi
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పలు నియామకాలు జరిగాయి. నియోజకవర్గ సమన్వయకర్తలు వీఆర్ రామిరెడ్డి, కె రమేష్ రెడ్డిలను పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా.. తాడిపత్రి నియోజక వర్గ సమన్వయకర్తగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ని నియమించారు. అలాగే రాష్ర్ట యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా కె ధనుంజయ యాదవ్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా సాంబశివారెడ్డిలు నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది.
మరిన్ని వార్తలు