దక్షిణాది రాష్ట్రాల్లో పేలుళ్ల కుట్ర భగ్నం

2 Oct, 2016 23:24 IST|Sakshi

చెన్నై: భారత్‌ సర్జికల్‌ దాడుల నేపథ్యంలో ఉగ్రవాదులు.. దక్షిణాది రాష్ట్రాల్లో భారీ పేలుళ్లకు కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు భగ్నం చేశారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఆదివారం ఆరుగురు ఐసిస్‌ సానుభూతిపరులను ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. తెలంగాణ, న్యూఢిల్లీ, కేరళ నిఘావర్గాల సహకారంతో ఎన్‌ఐఏ సానుభూతిపరులను అరెస్ట్‌ చేసినట్టు తెలుస్తోంది.

అరెస్ట్‌ అయిన ఐసిస్‌ సానుభూతిపరుల్లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన అబు బషీర్‌ (29), మహమ్మద్‌ (26), కేరళకు చెందిన మన్సీద్‌ (30), జాసిమ్‌ (25), ఖాన్‌ (24) ఉన్నారు. ఎన్‌ఐఏ అధికారులు వారిని విచారిస్తున్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు