నైజీరియన్ల అరెస్ట్‌: డ్రగ్స్‌ స్వాధీనం

17 May, 2017 16:34 IST|Sakshi
బనశంకరి: ఏటీఎం వద్దకు డబ్బు డ్రా చేసుకునేందుకు వచ్చే యువకులనే లక్ష్యంగా చేసుకుని మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ఓ ముఠాను బనశంకరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక కృష్ణరాజపురం పరిధిలోని టీసీ పాళ్య మెయిన్‌రోడ్డులో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం వద్ద నైజీరియా దేశస్తులు సంచిరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు సీసీఎస్‌ పోలీసులు అక్కడికి చేరుకుని పీటర్‌ చడీబేర్, ఫ్రాంక్లిన్, సావియార్‌చిక్వెడో, సుజనిలను అదుపులోకి తీసుకున్నారు.
 
వీరినుంచి  రూ. 26 లక్షల విలువైన  92 గ్రాముల అంఫెటమైన్, 101 గ్రాముల మోరఫిన్, 18 సెల్‌ఫోన్లు, 4 ల్యాప్‌టాప్‌లు, రెండు పాస్‌పోర్టులు, స్కూటర్, కారు, రూ.2,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కృష్ణరాజపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేపట్టారు.
 
మరిన్ని వార్తలు