తమిళనాడు నుంచి ఉత్తరాదికి వెళ్లే రైళ్లు రద్దు

18 Nov, 2015 07:18 IST|Sakshi
తమిళనాడు నుంచి ఉత్తరాదికి వెళ్లే రైళ్లు రద్దు

చెన్నై : భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో తమిళనాడు నుంచి పుదుచ్చేరి, ఉత్తరాదికి వెళ్లే రైళ్లు నేడు రద్దు చేసినట్లు రైల్వే శాఖ బుధవారం వెల్లడించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే 27 రైళ్లు రద్దు చేసినట్లు పేర్కొంది. భారీ వర్షాలతో రైల్వే ట్రాక్పైకి నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాక్ పాడైంది. నేడు చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, వేలూరు జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

మరిన్ని వార్తలు