అమరావతిలో ఎన్టీఆర్‌ మ్యూజియం

12 Jan, 2017 16:24 IST|Sakshi
అమరావతి : అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో ఎన్టీఆర్ మ్యూజియంను ఏర్పాటు చేయనున్నట్టు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ , ఆయన భార్య బ్రాహ్మణి తెలిపారు. ఎన్టీఆర్ ప్రస్థానాన్ని వివరించే అంశాలు ఇందులో ఉంటాయని వారు తెలిపారు. ఎన్టీఆర్ సేవలను రేపటి తరాలకు అందించటమే లక్ష్యంగా మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే విజయవాడలో ఈ నెల18న ప్రత్యేక  ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 
మరిన్ని వార్తలు