కాటేసిన పాముతో ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడు

22 Feb, 2019 11:35 IST|Sakshi
రంగనాథన్‌ను కాటేసిన పాము

భయంతో పరుగులు తీసిన రోగులు

అన్నానగర్‌: విరుదాచలంలో తనను కాటేసిన పాముతో ఓ వృద్ధుడు బుధవారం ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చాడు. వివరాలు.. కడలూరు జిల్లా విరుదాచలం సమీపం చిన్నకండియాంగప్పనికి చెందిన రంగనాథన్‌ (87) రైతు. ఇతను బుధవారం రాత్రి విరుదాచలం ప్రభుత్వ ఆస్పత్రికి ఓ ప్లాస్టిక్‌ సంచిలో సుమారు మూడున్నర అడుగుల ఓ పాముని తీసుకువచ్చాడు. చికిత్స కోసం వచ్చిన రోగులు, నర్సులు పాముని చూడగానే పరుగులు తీశారు. డాక్టర్లు రంగనాథన్‌ను విచారించగా.. తనను పాము కరచినట్లు చెప్పి, చికిత్స చేయాలని కోరాడు. డాక్టర్లు అతనికి చికిత్స అందిస్తున్నారు. అనంతరం ఆ పామును సమీపంలోని కాప్పుకోటలో వదిలిపెట్టారు.

మరిన్ని వార్తలు