అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

9 Oct, 2016 08:06 IST|Sakshi

గుంటూరు : గుంటూరు జిల్లా దుర్గి మండలం నరమాలపాడు వద్ద ఆదివారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని వైఎస్ఆర్ సీపీ నాయకుడు, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 420 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే లారీని కూడా స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు