రంగారెడ్డి: శంషాబాద్లోని గగన్పహాడ్ మెట్రో ప్రైవేట్ వెంచర్లో నాలుగు నెమళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. ఇది గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. విషాహారం తిని మృతి చెందాయా లేక ఎవరైనా హతమార్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.