అక్కమ్మ చెరువులో వ్యక్తి గల్లంతు

21 Sep, 2016 14:15 IST|Sakshi

మెదక్ జిల్లా జిన్నారం మండలం అక్కమ్మ చెరువులో పడి బుధవారం ఉదయం ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికంగా నివాసముంటున్న చాకలి రాములు(39) చెరువు సమీపంలో బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగిపోయాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసుల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని వార్తలు