గొల్లప్రోలు : తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ పెట్రోల్ అమ్ముతున్న ఓ పెట్రోల్ బంక్ను అధికారులు సీజ్ చేశారు. జిల్లాలోని గొల్లప్రోలులోని ఓ పెట్రోల్ బంక్లో కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారనే సమాచారంతో కాకినాడ ఆర్డీవో అంబెద్కర్ శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. కల్తీ విషయం నిజమేనని తేలడంతో పెట్రోల్బంక్ను సీజ్ చేశారు. కల్తీ పెట్రోల్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హెచ్చరించారు.