బాన్సువాడ: నిజామాబాద్ జిల్లాలో బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూరు, నస్రుల్లాబాద్ మండలాల పరిధిలోని నిజాంసాగర్ కాలువలను పరిశీలించారు. నీటి అందుబాటు, పంటసాగు గురించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రబీ సాగుకు సరిపడా నీటిని అందిస్తామని రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు