నెల్లూరు: ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠాను నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. 11 మంది బుకీలను గురువారం అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ. 9.45 లక్షల నగదుతో పాటు 42 సెల్ఫోన్లు, ఓ టీవీ స్వాధీనం చేసుకున్నారు.