కొత్తగూడెం: పెండింగ్లో ఉన్న ఇళ్ల పట్టాల సమస్య పరిష్కరించాలని కోరుతూ గత నాలుగు రోజులుగా కొత్తగూడెం బస్టాండు సెంటర్లో టీడీపీ నేత కోనేరు సత్యనారాయణ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో దీక్షా స్థలిని ఒక్కసారిగా చుట్టుముట్టిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.