ఫ్యామిలీ రెస్టారెంట్‌ ముసుగులో వ్యభిచారం

20 Aug, 2017 19:00 IST|Sakshi
ఫ్యామిలీ రెస్టారెంట్‌ ముసుగులో వ్యభిచారం

మండ్య(కర్ణాటక) : ఫ్యామిలీ రెస్టారెంట్‌ ముసుగులో హైటెక్‌ వేశ్యావాటిక నిర్వహిస్తున్న కేంద్రంపై పోలీసులు దాడి చేసి 22 మందిని అరెస్టు చేశారు. మండ్య జిల్లా శ్రీరంగపట్టణం తాలూకా నగువనహళ్లి గేట్‌ వద్ద మైసూరు, బెంగళూరు జాతీయ రహదారిలో మార్గా ఫ్యామిలీ రెస్టారెంట్‌ ఉంది. దీని కింద సొరంగం తరహాలో గుహ ఏర్పాటు చేసి కోల్‌కతా, ముంబై, బంగ్లాదేశ్‌కు చెందిన యువతులతో ఇక్కడ వేశ్యావాటిక నిర్వహిస్తున్నారు.

పక్కా సమాచారంతో జిల్లా ఎస్పీ జి.రాధిక నేతృత్వంలో పోలీసులు ఆదివారం ఆ హోటల్‌పై దాడి చేసి 22 మంది విటులను అరెస్టు చేశారు. వ్యభిచార కూపంలో చిక్కుకుపోయిన యువతులకు విముక్తి కల్పించారు. వీరి నుంచి ఐదు బైక్‌లు, కారు, ఆటో స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు