'మీరు ఎంపీ.. బతుకమ్మ అంబాసిడర్‌ కాదు'

28 Mar, 2017 11:00 IST|Sakshi
'మీరు ఎంపీ.. బతుకమ్మ అంబాసిడర్‌ కాదు'
జగిత్యాల: పెద్దపల్లి-నిజామాబాద్‌ రైల్వే లైనుపై పార్లమెంట్‌లో ఎంపీ కవిత మాట్లాడినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని మాజీ ఎంపీ పొన్నం ప‍్రభాకర్‌ సవాల్‌ విసిరారు. ఎన్నికలప్పుడు రైలు మార్గం పూర్తి చేస్తానని హామీ ఇచ్చానని, దానిని ఇప్పుడు నెరవేర్చానని ఎంపీ కవిత అనడం హాస్యాస్పదమన్నారు. మంగళవారం ఆయన జగిత్యాలలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటి వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1993లో కవిత రాజకీయాలలోకి వస్తా అని కూడా ఊహించని సమయంలోనే ప్రధానమంత్రి పీవీ రైల్వే నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారన్నారు.
 
మధుయాష్కీ, తాను ఎంపీలుగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం రైల్వే లైనుకు పెద్దపల్లి వరకు అనుమతిచ్చిందని గుర్తు చేశారు. హిందూ సంప్రదాయ ప్రకారం భర్త ఇంటి పేరు పెట్టుకుంటారని.. కవిత మాత్రం ఇప్పటికీ కల్వకుంట్ల కవిత అని చెప్పుకుంటున్నారు. మీరు నిజామాబాద్ ఎంపీవి, బతుకమ్మ అంబాసిడర్ వి కాదు, విదేశాలలో బతుకమ్మలు ఆడడం పక్కన బెట్టి, ఎంపీ అభివృద్ధి పై దృష్టి సారించాలని అన్నారు.
మరిన్ని వార్తలు